
అంతరంగాన్ని పురుగులా తొలిచీ, తొలిచీ
మధించీ, మధనపడీ
కవి హృదయంలో గూడు కట్టుకుంటుంది
పట్టుకాయ కవిత్వం.
తరువాత కవి తన ఆవేశపు వేడి నీటిలో
ముంచి తీసిన పట్టుకాయ కవిత్వాన్ని
పట్టుకొని, ఒక దారం కొసను దొరక బుచ్చుకొని
లాగుతూ పోతాడు.
జిలుగు లీనుతూ సాగిపోతున్న
పట్టుదారం కాస్తా కవిత్వమై కూర్చుంటుంది.
అప్పుడు కవి భాషా మగ్గంపై
పదాల కండెతో ఆసుబోసి
రంగులద్ది, తుది మెరుగులు దిద్ది
ఒక పట్టు కవితాంబరాన్ని నేస్తాడు.
2 వ్యాఖ్యలు:
అద్బుతంగా వర్ణించారు
మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.
Post a Comment