-
నా గురించి
Monday, November 30, 2009
సృష్టి
ముత్యం -
చూడడానికి చిన్నగానే ఉంటుంది
కాని ,
ఎంతటి లోతుల్ని ముట్టుకుంటే
అది ముత్యం .
ఎన్ని బడబాగ్నుల్నితట్టుకుంటే
అది ముత్యం .
తెప్ప -
పదిలంగా, నమ్మకంగా
ఏరు దాటిస్తుంది మనిషిని
కాని పాపం !
దానికి తెలియదు ఆవలి తీరం చేరే వరకూ -
తన బ్రతుకు తగలబడి పోనుందని.
ఊసరవెల్లి రంగులు మారుస్తుంది
ఆత్మరక్షణార్థం
మనిషి వేషాలు వేస్తాడు
ఉదర పోషణార్థం
బావిలోని కప్ప కెలా తెలుస్తుంది
సముద్రమంటే ఏమిటో !?
"ఆ ! మహా అంటే ఇంతకు
పది రెట్లుంటుందిలే "
అంటూ పెదవి విరుస్తుంది .
మండ్రగబ్బను చూడు !
గర్భం ధరించడం తోనే
మూడుతుంది చావు దానికి
పాపం !
అమ్మతనం తెలియకనే
కన్ను మూస్తుందది
గాలి పటం
వామ్మో ! ఎన్నికలా !
Sunday, November 29, 2009
నా మాట
వైద్యము వ్యాపారములయె .....
చిత్ర వైచిత్ర్యం
Saturday, November 28, 2009
2012 ..... యుగాంతం !?
డిసెంబర్ 21, 2012 నాడు మానవాళి,సమస్త ప్రాణికోటి పూర్తిగా అంతరించిపోనుందా !? ఈ మధ్య వార్తా పత్రికల్లో, టీవీల్లో కనబడుతున్న, వినబడుతున్న సంచలన వార్త యిది. ఐతే ఇందులో ఎంతవరకు నిజముంది ?
కొన్ని కారణాలను, నిజాలను పరిశీలిద్దాం.
1. దక్షిణ అమెరికాలో నివసించే 'మాయా' తెగల పంచాంగం ప్రకారం డిసెంబర్ 21, 2012 ప్రపంచానికి ఆఖరి రోజు.
2. ఖగోళ శాస్త్రజ్ఞుల అంచనాల ప్రకారం, 2012 లో సౌర తుఫానులు తీవ్ర రూపం దాల్చుతాయి. అవి ఇప్పటికే భూమి, మరికొన్ని గ్రహాలపై తమ ప్రభావాన్ని చూపుతున్నాయి.
3. శాస్త్రజ్ఞులు 2012లో అణు రియాక్టర్ ( LHC) లో ఒక గొప్ప అణువిస్ఫోటనం గావించి , విశ్వం యొక్క పుట్టు పూర్వోత్తరాలను కనుగొనబోతున్నారు. ఈ అణు రియాక్టర్ను ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ దేశాల భూగర్భంలో 27 కిలోమీటర్ల పొడవున్న సొరంగంలో నెలకొల్పారు. అక్కడ ఇప్పటికే కొన్ని పరీక్షలను జరుపుతున్నారు. ఐతే కొందరు 2012లో జరుపబడే ఈ అణుపరీక్ష వికటించి, సమస్త జంతుజాలం నశించిపోతుందని చెబుతున్నారు.
4. బైబిల్ ప్రకారం 2012లో మంచీ - చెడుల మధ్య ఆఖరిపోరాటం జరగబోతోంది. హిందూ శాస్త్రాలలో కలికి అవతారం గురించి, " మ్లేచ్చ నివహ నిధనే కలయసి కరవాలం; ధూమకేతుమివ కిమపి కరాళం" అని ఉండనే ఉంది.
మరికొందరి అభిప్రాయం ప్రకారం, మానవాళి పూర్తిగా నశించదు. కాని వారిలో ఒక గొప్ప నూతన ఆధ్యాత్మిక మార్పు వస్తుంది. శ్రీ అరబింద్ ఘోష్ కూడా " మనిషి ఏదో ఒకరోజు supramental స్థితిని అందుకోగలుగుతాడు " అని చెప్పారు.
5. అమెరికాలోని యెల్లోస్టోన్ నేషనల్ పార్క్ ఎప్పుడూ వేడినీటి బుగ్గలను విరజిమ్ముతూ ఉంటుంది. దీనికి కారణం అది సరిగ్గా ఒక అగ్నిపర్వతం మీద నెలకొని ఉంది. ఐతే ఈ అగ్నిపర్వతానికి ప్రతి 650,000 సంవత్సరాలకొకసారి ఆవులించే ఒక చెడ్డ అలవాటు ఉంది. దాని మూలంగా ఆకాశమంతా బూడిదతో కప్పబడి, సూర్యరశ్మి భూమిపై సోకదు. అప్పుడు భూమి పూర్తిగా చల్లబడి, మంచుఖండంలా మారుతుంది. అది అలా 15,000 సంవత్స్సరాల వరకు కొనసాగుతుంది.
యెల్లోస్టోన్ నేషనల్ పార్క్ అడుగన రోజురోజుకీ పీడనం పెరుగుతోంది. అది 2012లో పూర్తిస్థాయిలో ఉంటుందని భూగర్భ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
6. ఉత్తర దక్షిణ ధ్రువాలు ప్రతి 750,000 సంవత్సరాల కొకసారి తమ స్థానాలు మార్చుకుంటాయట ! ఇప్పటికే ధ్రువాలు ఏడాదికి 20 - 30 కిలోమీటర్లు ఎడంగా జరుగుతున్నాయట ! అలా క్రమేపీ భూమి చుట్టు ఉన్న అయస్కాంత శక్తి నశించిపోయి , అల్ట్రా వయొలెట్ కిరణాలు భూమిపై సోకి, సర్వ ప్రాణులను నశింప జేస్తాయని ఒక కథనం.
7. 2012లో ఒక పెద్ద ఉల్క భూమిని ఢీకొనబోతోది. అలా కాని జరిగితే ,అప్పుడు భయంకరమైన భూకంపాలు, సునామీలు సంభవించవచ్చు.
... ఐతే నిజంగా డిసెంబర్ 21,2012 నాడు ప్రళయం రాబోతోoదా !?
ఇది అంతు చిక్కని ప్రశ్న !
Friday, November 27, 2009
శైశిరాగమనం
Thursday, November 26, 2009
సమస్యా పూరణం
అరగదు ఒకడికి...
Monday, November 23, 2009
మర్రిచెట్టు
కంట్రాక్టరుకు నిర్వచనం
చెంబు మిత్ర
ఒకాయన కొత్తగా పట్నం నుండి ఒక పల్లెటూరికి ఉద్యోగ రీత్యా, బదిలీ ఐ వచ్చాడు. ఆయన పేరు శంభుమిత్ర .
ఆ వూరిలో పెందరాళే కాలకృత్యాలు తీర్చుకోవాలంటే , ఎవరైనా సరే చెంబులో నీళ్ళు పట్టుకొని ఊరవతలికి వెళ్ళాల్సిందే.
పాపం ! ఎప్పుడూ అలవాటు లేదేమో, అలా అందరు చూస్తుండగా వీథి గుండా చెంబు పుచ్చుకొని ఊరవతలకి వెళ్ళడం శంభుమిత్రకు మహా ఇబ్బందిగా ఉండేది.
ఆ అవస్థ చూసి నవ్వుకొని , ఆయనకు ఆ ఊరి కుర్రకారు పెట్టిన పేరు ," చెంబు మిత్ర. "
కరి మబ్బులు
చూస్తుండగానే ఆకాశంలో
కారుమేఘాల ఏనుగుల గుంపొకటి
బయలుదేరింది ఒకదాన్నొకటి తోసుకుంటూ -
అవి తమ చేటచెవుల్ని గట్టిగా
ఊపడంతో చల్లనిగాలి
భూమిపైకి మెల్లగా వేచింది.
వాటి పద ఘట్టనలో నేల పెల్లగించబడి
కమ్మని మట్టివాసన ఒక్కసారి
ముక్కుపుటాలను తాకింది.
అవి ఊడబెరికిన లతలు
నింగిపై తటిల్లతలై మెరిశాయి.
వాటి ఘీంకారాలు ఉరుములై
చెవులను బద్దలు చేశాయి.
తొండాలతో నీళ్ళను కుమ్మరించినట్టు
వాన ధారాపాతంగా కురిసింది.
ఏనుగులు ఒకటి,రెండు గంటలు
స్వైరవిహారం చేసి,
పశ్చిమాద్రి కవతల అడవిలోకి
వెళ్ళిపోయాయి ఒక్కటొక్కటిగా.
ఆకాశం మళ్ళీ నిర్మలంగా తయారైంది.
ఏనుగులు వచ్చిపోయిన జాడే లేదు.
కాని వాటి ఆనవాళ్ళు మాత్రం
రోడ్డు పక్కన మిగిలాయి.
Saturday, November 21, 2009
పిన్నలు ఇద్దరు దాటిన ...
Thursday, November 19, 2009
జీవన మాధుర్యము
దానగుణము
Tuesday, November 17, 2009
అన్నమాచార్య
సారంగా ! ....
సారంగా !
నీ జ్ఞాపకాలతో
నా కళ్ళు అలసిపోయాయి.
మధురమైన నీ సంగమం లేక
క్షణాలు గడవడం దుర్భరంగా ఉంది.
ఆ ఊగిన ఉయ్యాలలు
ఆ రావిచెట్టు నీడ
ముసుగులోని చందమామ
కాళ్ళకు పండిన గోరింటాకు
ఆ స్వప్న జగత్తు ...
అవన్నీ నేడు నాకు కరువైనాయి.
నీతో గడిపిన ఆ రెండు క్షణాలు
సజలమైన నయనాల్లో
నేడు నాకు కనుమరుగైనాయి.
సుఖం స్థానే దుఃఖం
అలసిన నా ఈ రెండు కళ్ళు.
( ముఖేష్ పాడిన హిందీ సినిమా పాట 'సారంగా తేరి యాద్ మే ' కు తెలుగులో )
పాయసము లేని డిన్నరు .....
రాతిని నాతిగ జేసి ....
Thursday, November 12, 2009
గౌతమ్ ఘోష్
'''గౌతమ్ ఘోష్''' ప్రఖ్యాత భారతీయ సినిమా దర్శకుడు; మంచి ''ఫోటో జర్నలిస్ట్'' కూడా. అతడు 1950 వ సంవత్సరంలో కోల్కతా లో జన్మించాడు.
==సినిమా ప్రస్థానం==
గౌతమ్ ఘోష్ కలకత్తా యునివర్సిటీ నుండి పట్టా పొంది, సినిమాలలో ప్రవేశించాడు. ఆయన మొదటి సినిమా- మా భూమి, తెలుగులో తీసింది. 1930 - 1948 ప్రాంతంలో, హైదరాబాదు నిజాం కు వ్యతిరేకంగా ఎదిగిన కార్మికుల గురించి తీసిన సినిమా ఇది; ఎన్నో రోజులు తెలుగు నాట ఆడింది. అతని సినిమాలన్నీ సామాజిక స్థితిగతులనే ప్రతిబింబిస్తుంటాయి.
==ముఖ్యమైన సినిమాలు==
* [[మా భూమి]] ( 1979 )
* దఖల్ ( 1981 )
* పార్ ( 1984 )
* అంతర్జలి జాత్రా ( 1987 )
* పద్మ నాదిర్ మఝి ( 1992 )
* పతంగ్ ( 1993 )
* గుడియా ( 1997 )
* అబర్ అరణ్యె ( 2003 )
* యాత్రా ( 2006 )
* కాల్ బేలా ( 2009 )
* సంగెమీల్ సె ములాఖత్ ( షెహనాయ్ విద్వాంసుడు, [[ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్]] పై తీసిన డాక్యుమెంటరీ )
==బయటి లింకులు==
* [http://www.imdb.com/name/nm0315872/ గౌతమ్ ఘోష్ - ఇంటర్నెట్ మూవీ డేటాబేస్]
* [http://www.calcuttaweb.com/cinema/gautamghosh.shtml ప్రొఫైల్]
==సినిమా ప్రస్థానం==
గౌతమ్ ఘోష్ కలకత్తా యునివర్సిటీ నుండి పట్టా పొంది, సినిమాలలో ప్రవేశించాడు. ఆయన మొదటి సినిమా- మా భూమి, తెలుగులో తీసింది. 1930 - 1948 ప్రాంతంలో, హైదరాబాదు నిజాం కు వ్యతిరేకంగా ఎదిగిన కార్మికుల గురించి తీసిన సినిమా ఇది; ఎన్నో రోజులు తెలుగు నాట ఆడింది. అతని సినిమాలన్నీ సామాజిక స్థితిగతులనే ప్రతిబింబిస్తుంటాయి.
==ముఖ్యమైన సినిమాలు==
* [[మా భూమి]] ( 1979 )
* దఖల్ ( 1981 )
* పార్ ( 1984 )
* అంతర్జలి జాత్రా ( 1987 )
* పద్మ నాదిర్ మఝి ( 1992 )
* పతంగ్ ( 1993 )
* గుడియా ( 1997 )
* అబర్ అరణ్యె ( 2003 )
* యాత్రా ( 2006 )
* కాల్ బేలా ( 2009 )
* సంగెమీల్ సె ములాఖత్ ( షెహనాయ్ విద్వాంసుడు, [[ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్]] పై తీసిన డాక్యుమెంటరీ )
==బయటి లింకులు==
* [http://www.imdb.com/name/nm0315872/ గౌతమ్ ఘోష్ - ఇంటర్నెట్ మూవీ డేటాబేస్]
* [http://www.calcuttaweb.com/cinema/gautamghosh.shtml ప్రొఫైల్]
Wednesday, November 11, 2009
కవితాంబరం
అంతరంగాన్ని పురుగులా తొలిచీ, తొలిచీ
మధించీ, మధనపడీ
కవి హృదయంలో గూడు కట్టుకుంటుంది
పట్టుకాయ కవిత్వం.
తరువాత కవి తన ఆవేశపు వేడి నీటిలో
ముంచి తీసిన పట్టుకాయ కవిత్వాన్ని
పట్టుకొని, ఒక దారం కొసను దొరక బుచ్చుకొని
లాగుతూ పోతాడు.
జిలుగు లీనుతూ సాగిపోతున్న
పట్టుదారం కాస్తా కవిత్వమై కూర్చుంటుంది.
అప్పుడు కవి భాషా మగ్గంపై
పదాల కండెతో ఆసుబోసి
రంగులద్ది, తుది మెరుగులు దిద్ది
ఒక పట్టు కవితాంబరాన్ని నేస్తాడు.
అబ్దుల్ కరీంఖాన్
'''అబ్దుల్ కరీంఖాన్''' లేదా '''ఉస్తాద్ అబ్దుల్ కరీంఖాన్''' (నవంబరు 11, (1872 - 1937) , 20 వ శతాబ్దపు హిందుస్తానీ సంగీతంలోని కిరాణా ఘరానాకు చెందిన వారిలో ప్రముఖుడు.
==జీవితం==
అబ్దుల్ కరీంఖాన్ ఉత్తరభారతంలోని కిరాణా అనే ప్రాంతంలో జన్మించాడు. కిరాణా ఘరానాకు మూలపురుషులు, గులాం అలీ మరియు
గులాం మౌలా లు. కరీంఖాన్ తండ్రి, కాలే ఖాన్ గులాం అలీ మనవడు. కరీంఖాన్ తండ్రి వద్ద మరియు మామ అబ్దుల్లా ఖాన్ వద్ద
శిక్షణను పొందాడు. గాత్రం, సారంగి, వీణ, సితార్, తబలా - వీటన్నిటినీ నేర్చుకున్నాడు కరీంఖాన్.
==సంగీత ప్రస్థానం==
మొదట్లో సారంగి వాయించినా, క్రమంగా గాత్రానికి మళ్ళాడు ; సోదరుడు అబ్దుల్ హక్ తో కలిసి పాడేవాడు. బరోడా రాజు వారి గాత్ర సంగీతానికి ముగ్ధుడై, వారిని తన ఆస్థాన సంగీత విద్వాంసులుగా నియమించాడు. ఇక్కడే కరీంఖాన్ రాజవంశానికి చెందిన తారాబాయ్ మానెను పెళ్ళాడాలనుకున్నాడు. కాని బరోడా నుండి బహిష్కృతులై , ఆ దంపతులు ముంబై చేరుకున్నారు. 1922లో తారాబాయ్ మానె అబ్దుల్ కరీంఖాన్ను వదలి వెళ్ళిపోయిన తర్వాత, ఆయన జీవితంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
మైసూరు దర్బారులో, గొప్ప కర్ణాటక సంగీత గాయకులను కలుసుకోవడం మూలాన, ఆ ప్రభావం ఆయన పాటల్లో కనిపించేది. 1900 లో ఆయన ప్రఖ్యాత గాయకుడు, సవాయి గంధర్వకు ఎనిమిది నెలలు సంగీతాన్ని నేర్పాడు. అక్కడే మరో ప్రసిద్ధి చెందిన సంగీత విద్వాంసురాలు, కేసర్బాయ్ కేర్కర్ కు శిక్షణ నిచ్చాడు. 1913లో పుణె లో అబ్దుల్ కరీంఖాన్ ఆర్య సంగీత విద్యాలయాన్ని స్థాపించాడు. తరువాత మీరజ్ లో స్థిరపడి, మరణించేంత వరకూ (1937) అక్కడే ఉన్నాడు.
కిరాణా ఘరానా శైలి రాగం, మంద్రస్థాయిలో మొదలయ్యి, విలంబిత్ లయలో మృదుమధురంగా సాగుతుంది. అబ్దుల్ కరీంఖాన్ ఠుమ్రీలు కూడా ప్రత్యేక శైలిని కలిగి వుంటాయి. ఆయన ఒక త్యాగరాజ కృతిని కూడా ఆలపించాడు.
==అబ్దుల్ కరీంఖాన్ శిష్యుల్లో అగ్రగణ్యులు==
* సవాయి గంధర్వ
* సురేష్బాబు మానె
* హీరాబాయ్ బరోడేకర్ లు.
==వనరులు==
*1. [http://www.itcsra.org/tribute.asp?id=1ITC Sangaata Research Acaademy]
(అబ్దుల్ కరీం ఖాన్ జన్మదినం (నవంబర్ 11 ) సందర్భంగా - )
==జీవితం==
అబ్దుల్ కరీంఖాన్ ఉత్తరభారతంలోని కిరాణా అనే ప్రాంతంలో జన్మించాడు. కిరాణా ఘరానాకు మూలపురుషులు, గులాం అలీ మరియు
గులాం మౌలా లు. కరీంఖాన్ తండ్రి, కాలే ఖాన్ గులాం అలీ మనవడు. కరీంఖాన్ తండ్రి వద్ద మరియు మామ అబ్దుల్లా ఖాన్ వద్ద
శిక్షణను పొందాడు. గాత్రం, సారంగి, వీణ, సితార్, తబలా - వీటన్నిటినీ నేర్చుకున్నాడు కరీంఖాన్.
==సంగీత ప్రస్థానం==
మొదట్లో సారంగి వాయించినా, క్రమంగా గాత్రానికి మళ్ళాడు ; సోదరుడు అబ్దుల్ హక్ తో కలిసి పాడేవాడు. బరోడా రాజు వారి గాత్ర సంగీతానికి ముగ్ధుడై, వారిని తన ఆస్థాన సంగీత విద్వాంసులుగా నియమించాడు. ఇక్కడే కరీంఖాన్ రాజవంశానికి చెందిన తారాబాయ్ మానెను పెళ్ళాడాలనుకున్నాడు. కాని బరోడా నుండి బహిష్కృతులై , ఆ దంపతులు ముంబై చేరుకున్నారు. 1922లో తారాబాయ్ మానె అబ్దుల్ కరీంఖాన్ను వదలి వెళ్ళిపోయిన తర్వాత, ఆయన జీవితంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
మైసూరు దర్బారులో, గొప్ప కర్ణాటక సంగీత గాయకులను కలుసుకోవడం మూలాన, ఆ ప్రభావం ఆయన పాటల్లో కనిపించేది. 1900 లో ఆయన ప్రఖ్యాత గాయకుడు, సవాయి గంధర్వకు ఎనిమిది నెలలు సంగీతాన్ని నేర్పాడు. అక్కడే మరో ప్రసిద్ధి చెందిన సంగీత విద్వాంసురాలు, కేసర్బాయ్ కేర్కర్ కు శిక్షణ నిచ్చాడు. 1913లో పుణె లో అబ్దుల్ కరీంఖాన్ ఆర్య సంగీత విద్యాలయాన్ని స్థాపించాడు. తరువాత మీరజ్ లో స్థిరపడి, మరణించేంత వరకూ (1937) అక్కడే ఉన్నాడు.
కిరాణా ఘరానా శైలి రాగం, మంద్రస్థాయిలో మొదలయ్యి, విలంబిత్ లయలో మృదుమధురంగా సాగుతుంది. అబ్దుల్ కరీంఖాన్ ఠుమ్రీలు కూడా ప్రత్యేక శైలిని కలిగి వుంటాయి. ఆయన ఒక త్యాగరాజ కృతిని కూడా ఆలపించాడు.
==అబ్దుల్ కరీంఖాన్ శిష్యుల్లో అగ్రగణ్యులు==
* సవాయి గంధర్వ
* సురేష్బాబు మానె
* హీరాబాయ్ బరోడేకర్ లు.
==వనరులు==
*1. [http://www.itcsra.org/tribute.asp?id=1ITC Sangaata Research Acaademy]
(అబ్దుల్ కరీం ఖాన్ జన్మదినం (నవంబర్ 11 ) సందర్భంగా - )
Tuesday, November 10, 2009
భక్షక భటుడు
ఉడ్డీనము
Monday, November 9, 2009
అనంత పద్మనాభ స్వామి దేవాలయము లోని గోపురము.
Sunday, November 8, 2009
చెలిమి
Saturday, November 7, 2009
ఇంటర్నెట్
గులాం అలీ
భానుప్రియ
Thursday, November 5, 2009
సచిన్ టెండూల్కర్
Wednesday, November 4, 2009
సినారె
Tuesday, November 3, 2009
ఎస్.పి. బాలసుబ్రమణ్యం
Monday, November 2, 2009
రంపపు కోత
ఒక ఊళ్ళో ఒక ఆసామి కొత్తగా తను తెరచిన రంపపు కోత మిల్లుకు మంత్రి గారితో ప్రారంభోత్సవం చేయిస్తున్నాడు.
ఇంతలో ఎవరో ఒకాయన , " సార్ ! మీకీ మిల్లును తెరవాలనే ఐడియా ఎలా వచ్చింది ? " అని ప్రశ్నించాడు.
దానికా ఆసామి " అయ్యా ! ఇది చనిపోయిన నా భార్య జ్ఞాపకార్థం ! " అంటూ సెలవిచ్చాడు.
( నేను వ్రాసిన యీ జోకు ఆంధ్రప్రభ వారపత్రిక - 11 - 1993 లో ప్రచురింపబడింది.)
Sunday, November 1, 2009
విరిసిన వెన్ని పూలు ....
చిన్ననాటి స్నేహితులారా !
గుట్టలవతల
మామిడి చెట్ల నీడన,
గుట్ట కివతల
పిల్లిగుండ్ల కాడ
తిరుగలేదా మనము
కలిసి బడికి వెళ్ళలేదా !
పెచ్చెరువు కట్ట మీద
పొద్దుగూకి పోతుంటె,
పాంపిల్ల ఎదురైతె
జడువలేదా మనము
ఉరికి ఉరికి యిల్లు చేరలేదా !
తేనె తెద్దామని జెప్పి
గుట్టగుండ్లకు బోతె,
పిచ్చికోపమున ఈగ కుట్టలేదా మనను
ముక్కుమీద ముల్లును దించలేదా !
యాసాడ గైన్ దాటి
పొలం గట్లను దాటి
పిక్నిక్కు కని వెళ్ళలేదా మనము
వాగులో యీదులాడలేదా !
చేపపిల్ల నొకదాన్ని పట్టలేదా !
పద్మనాభం సారు
పట్టుబట్టి కూసుంటె
లవకుశుల వేషం
వెయ్యలేదా మనము
గొంతెత్తి పద్యాలు పాడలేదా !
జండావందనము నాడు
పొద్దుగాల్నే లేశి
నాక కడకు నడచి
వెళ్ళలేదా మనము !
జాతీయ గీతము పాడలేదా !
ఎలగందుల ఖిల్లా
నెక్కిచూచిన రోజు
నెత్తుటి గాథలు
చెప్పుకోలేదా మనము !
గతవైభవ చిహ్నాలు
గుర్తు లేవా మనకు !
బాల్యం
ఎంత సుందరమైనదీ బాల్యం
నా కిది ఎంతో అమృత తుల్యం.
ఎంత మధురమైనదీ జీవితం
కలతలు,కష్టాలు తెలియని తనం.
ఏ కట్టుబాట్లు లేని నేను
కొండల్లో తిరుగుతాను
కోనల్లో పలుకుతాను
వర్షంలో తడుస్తాను
వడగళ్ళను యేరుతాను
కోయిల గానాన్ని వింటాను
సెలయేట్లో తానమాడతాను
సాయంత్రం చెరువులో మునిగిపోతున్న
సూర్యుణ్ణి చూస్తూ అలాగే నిలుచుంటాను.
ఏభయాలూ లేని నేను
పాడుకొనేది పచ్చని వరిపొలాల్లో
ఆడుకొనేది అనుభూతుల వలయాల్లో
ఆడిపాడి, అలసి సొలసి
నిద్రించేది అమ్మ ఒడిలో.
ఓ కవీ ! కృష్ణ శాస్త్రీ ! ( ముత్యాల సరాలు )
ఆకులో ఆకువైనావా !
పూవులో పూవువైనావా !
అడవిలోనే దాగినావా !
ఓ కవీ ! కృష్ణ శాస్త్రీ !
ఇరుల గుసగుస తెలుసు నీకూ
కనుల బాసలు తెలుసు నీకూ
పోయినావా అమరలోకం
నీవు ప్రవాసివై !
భావ కవితకు భావి యువతకు
దారి చూపిన దివ్వె నీవే
కొత్త పోకడ పద్యములతో
వ్రాసినది నీవే !
మూగవోయిన గొంతులోనూ
కోటిరాగాల్ పలికినావూ
తీయతేనియ బరువులెన్నో
పాట లోపల నింపుతూ !
అశ్రువొక్కటి జారవిడువని
మనిషి అంటూ ఉండబోవడు
నీదు విషాద గాథలన్ విని
గుండె నీరై కరుగగా !
మరుగు వెన్నెల దారులంబడి
తొలుత గంధర్వ లోకాలకు
వియోగ గీతివై వెళితివా
నీవు ఊర్వశికై !
( దేవులపల్లి కృష్ణశాస్త్రి జన్మదినం ( 1 నవంబర్ ) సందర్భంగా - )
Subscribe to:
Posts (Atom)
నెలవారీ పోస్టులు
-
▼
2009
(135)
-
▼
November
(43)
- సృష్టి
- గాలి పటం
- వామ్మో ! ఎన్నికలా !
- నా మాట
- వైద్యము వ్యాపారములయె .....
- చిత్ర వైచిత్ర్యం
- 2012 ..... యుగాంతం !?
- శైశిరాగమనం
- సమస్యా పూరణం
- అరగదు ఒకడికి...
- మర్రిచెట్టు
- కంట్రాక్టరుకు నిర్వచనం
- అపాత్ర దానము
- చెంబు మిత్ర
- కరి మబ్బులు
- పిన్నలు ఇద్దరు దాటిన ...
- జీవన మాధుర్యము
- దానగుణము
- అన్నమాచార్య
- సారంగా ! ....
- పాయసము లేని డిన్నరు .....
- రాతిని నాతిగ జేసి ....
- గౌతమ్ ఘోష్
- కవితాంబరం
- అబ్దుల్ కరీంఖాన్
- భక్షక భటుడు
- ఉడ్డీనము
- అనంత పద్మనాభ స్వామి దేవాలయము లోని గోపురము.
- గాయత్రి మాత దేవాలయము
- హిమాయత్ సాగర్ చెరువు
- చెలిమి
- ఇంటర్నెట్
- గులాం అలీ
- భానుప్రియ
- సచిన్ టెండూల్కర్
- సినారె
- ఎస్.పి. బాలసుబ్రమణ్యం
- హమ్మింగ్ బర్డ్ -2
- రంపపు కోత
- విరిసిన వెన్ని పూలు ....
- చిన్ననాటి స్నేహితులారా !
- బాల్యం
- ఓ కవీ ! కృష్ణ శాస్త్రీ ! ( ముత్యాల సరాలు )
-
▼
November
(43)